E.G: గోపాలపురం నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి శుక్రవారం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శుక్రవారం దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, శాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు మంచి జరగాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో జీవించాలని స్వామి వారి ఆశీస్సులు కోరుకున్నారు.