PPM: పట్టణంలో శనివారం ఉదయం స్దానిక పోలీసులు ‘వజ్ర పహార్’ కార్యక్రమంలో భాగంగా కార్షన్ సెర్చ్ను నిర్వహించారు. ఎస్పీ ఎస్.వీ.మాధవరెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రెల్లి వీధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 6 మోటార్ సైకిళ్ళు, 12 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.