BPT: పిడుగురాళ్ల–వాడరేవు 167A జాతీయ రహదారిపై పర్చూరు మండలం ఉప్పుటూరు వద్ద నిర్మించిన టోల్ ప్లాజా గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. గత రెండు రోజులుగా సాంకేతిక పరీక్షలు నిర్వహించిన అధికారులు, వాహనదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.