ప్రకాశం: త్రిపురాంతకం మండలం ధూపడు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను పగలగొట్టి రాగి వైరు చోరీ చేశారు. సాగర్ వాటర్ పంప్ హౌస్కు ఇదే ట్రాన్స్ ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో ఆ ప్రాంతంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.