TPT: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత ప్రభుత్వంలో అనేక నిబంధనలు చూపి తొలగించిన వాటితో పాటు కొత్తవి ఎప్పుడిస్తారా? అని అర్హత కలిగిన వారు చూస్తున్నారు. జనవరి నుంచి ఆప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్ప, ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, నేడు CM చంద్రబాబు జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏదైనా హమీ ఇస్తారా అన్న ఆశలు ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తోంది.