W.G: పోడూరు మండలం చింతలగరువు పాఠశాలలో రాయప్రోలు సుబ్బారావు జయంతిని హెచ్.ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సుబ్బారావు నవ్యకవితా పితామహుడుగా పేరు గాంచారు అన్నారు. ఈ సందర్బంగా రాయప్రోలు సుబ్బారావు రచించిన ‘ఏ దేశమేగినా’ అభినయ గేయాన్ని విద్యార్థులు ప్రదర్శించి నివాళులర్పించారు.