SKLM: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే చీపుర్లుపాడు వద్ద మార్కెట్ యార్డు ,సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి మంజూరు చేశారు. మొత్తం 3 కోట్ల 20 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.