TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి త్రిపుర సీఎం మనీష్ షా కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని దర్శనం అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.