విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య వచ్చినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన పైలట్ అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో సంస్థ తెలిపింది.