KDP: కొండాపురం మండల పరిధిలోని తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మంజునాథ శుక్రవారం తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. గురువారం రాత్రి పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని నరసింహా, దేవిరెడ్డి పవన్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కౌంటర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.