AKP: మునగపాక మండలం కుంచవానిపాలెంలో పి.పారుపల్లి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు శుక్రవారం ఛేదించారు. పారుపల్లిని అతని భార్య పరమేశ్వరి హత్య చేసినట్లు విచారణలో పోలీసులు నిర్ధారించారు. మద్యానికి బానిసైన పారుపల్లి తనను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ఈనెల 1వ తేదీ రాత్రి గొంతు నిలిమి హత్య చేసినట్లు ఆమె అంగీకరించిందని ఎస్సై సీఐ ధనుంజయ నాయుడు తెలిపారు.