శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామంలో బాదం పాలు తాగిన సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. జాతర సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పాలు తాగిన వారికి జ్వరం, వాంతులు, విరోచనాలు వచ్చాయి. బాధితులు స్థానిక క్లినిక్లకు చేరగా, అధికారులు వెంటనే స్పందించి క్లినిక్లను మూసివేసి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.