ప్రకాశం: రాచర్ల (మం) నెమలిగుండ్లలో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.