ప్రకాశం: గిద్దలూరు మండలంలోని ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఆదివారం మొక్కజొన్న సోమపురిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. అయితే, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో మొక్కజొన్న రైతులు ఊపిరి పీల్చుకున్నారు.