ASR: సిబ్బంది నియామకాలతో జీసీసీని బలోపేతం చేయాలని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన అమరావతి సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ను కలిసి జీసీసీలోని సిబ్బంది కొరత, పరిపాలన, నిర్మాణాత్మక సమస్యలపై చర్చించారు. జీసీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, జీసీసీ గోదాములు, డిపోలను మరమ్మత్తులు చేయాలని తెలిపారు.