KDP: సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల గ్రామంలో ఈనెల 8వ తేదీ నుంచి శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు జరగనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 8వ తేదీన వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. 9వ తేదీన హోమాలు, గ్రామోత్సవం ఉంటుందన్నారు.10వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ, సాంస్కృతిక కార్యక్రమాలు, బండలాగుడు పోటీలు ఉంటాయని తెలిపారు.