ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి, పామిడి మండల ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ను శుక్రవారం వారి నివాసంలో నూతనంగా నియమించిన గుత్తి మండల తెలుగు యువత అధ్యక్షులు కిట్ట యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కిట్ట యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు దానికి సహకరించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు.