సత్యసాయి: రొద్దంలో మహిళలు, బాలికల భద్రతపై శనివారం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగంపై వివరించారు. సైబర్ క్రైమ్లు, ఫ్రాడ్ లోన్స్ మోసాలు, బాల్య వివాహాల నివారణ, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రేణుక, కానిస్టేబుల్ పోతన్న, హుస్సేన్ భాష పాల్గొన్నారు.