ప్రకాశం: మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతున్నాయి. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో కొందరు కూటమి నాయకులు జేసీబీలు వినియోగించి ట్రాక్టర్ల ద్వారా మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు.