NDL: మహానంది మండలం అల్లినగరం ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు శక్తి టీం సభ్యులు కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థి తల్లి మొబైల్లో శక్తి యాప్ ఉండాలని హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ సూచించారు. సైబర్ నేరాలు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు పాల్గొన్నారు.