ప్రకాశం: అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కాపురంలో R&B కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2సం. లు గడిచిన తమ సమస్యను పట్టించుకోలేదని, గర్భిణీ దశ నుండి చిన్నారుల పాఠశాలకు వెళ్లే వరకు సేవలందిస్తున్నామన్నారు.