ప్రకాశం: సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా DYFI యువజన ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన ‘జన చైతన్య జీపు యాత్ర’ బుధవారం సింగరాయకొండకు చేరుకుంది. ఈ యాత్ర ఏప్రిల్ 6 నుంచి 9 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగనుంది. ఈ సందర్భంగా గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై నిర్వాహకులు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.