KRNL: ఈనెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి గ్రామాల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. విలేజ్ అర్బన్ సెంటర్లలో ప్రచారం చేపట్టాలని సూచించారు.