పార్వతీపురం పట్టణం కొత్తవలసలో కొత్త పోలమ్మ పండుగ వివాదం రేపుతోంది. ఈనెల 27 నుంచి 29 వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా, అమ్మవారిని తమ వీధిలోకి తీసుకురావాలని ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. అయితే, అగ్రవర్ణాలకు చెందిన కమిటీ పెద్దలు ఇందుకు నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాలనీ ప్రజలు నిరసన చేపట్టారు.