ASR: ప్రజలు మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. శనివారం అనంతగిరి మండలం, శివలింగపురం గ్రామంలో నిర్వహించిన ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. గ్రామంలో అనంతగిరి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 14 వాహనాలను సీజ్ చేశామన్నారు. గంజాయి సాగు, వినియోగం, రవాణా నేరమని డీఎస్పీ అన్నారు.