BPT: అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 33వ మైలు వద్ద మంచినీరు తాగేందుకు దిగిన మహిళ నీటి ప్రవాహం వేగానికి కాలువలో కొట్టుకుపోయింది. వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి భవాని (28) మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పొలం నుంచి తిరిగి వస్తూ మంచినీరు తాగేందుకు కాలువలో దిగింది. ఈ సమయంలో నీటి ప్రవాహ వేగాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.