కృష్ణా: అవనిగడ్డ మండలం టీడీపీ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో బాబు జగర్జీవన్ రామ్ జయంతి ఘనంగా జరిగింది. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.