పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం రాబోయే పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ 30-35% వరకు ఎస్సీ ఓటర్లు ఉండటమే దీనికి ప్రధాన కారణం. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలు, ఘర్షణలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో ఆధిపత్య వర్గాలకు చెక్ పెట్టేందుకు, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఈ వ్యూహం జరుగుతోంది.