NRPT: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ నెల సందర్భంగా నర్వ మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జామా మసీద్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంజాన్ ప్రార్థనల కోసం భక్తులు తరలవచ్చేలా రంగురంగుల వెలుగులతో మసీదు శోభాయమానంగా తీర్చిదిద్దబడింది. రాత్రి వేళల్లో మసీదు మెరిసిపోతోంది. ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రత్యేక నమాజ్లు నిర్వహిస్తున్నారు.