ASR: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పీహెచ్సీ డాక్టర్ హేమంత్ చౌదరి సిబ్బందికి సూచించారు. శుక్రవారం పలకజీడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. 64మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఈవో గంగరాజు, ఎల్టీ ఆనంద్ పాల్గొన్నారు.