KKD: ప్రేమించానని చెప్పి బాలికను మోసగించి, అత్యాచారం చేసిన యువకుడిపై కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కాకినాడకి చెందిన బాలిక(17) తొమ్మిదో తరగతి వరకూ చదివి ఇంటి వద్దే ఉంటుంది. బాలికకు అనారోగ్య సమస్యతో శుక్రవారం కాకినాడ జీజీహెచ్కు తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి ఆమె 16 వారాలు గర్భవతి అని చెప్పారు. బాలికను ప్రశ్నించగా విషయం బయటపడింది.