ATP: గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రభుత్వ హోమియో డాక్టర్ తిరుపతి నాయుడు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. కనీసం రోజుకు 3-4 లీటర్ల నీరుని తీసుకోవాలన్నారు. వదులుగా ఉండే తేలికపాటి దుస్తులను ధరించాలన్నారు. పాఠశాలలోని 120 మంది విద్యార్థులకు హోమియో మందులను అందజేశారు.