అన్నమయ్య: జిల్లాలో 2028 నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సుండుపల్లెను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. వీరబల్లి, కె.వి.పల్లె, యర్రావారిపాలెం మండలాలతో కలిపి సుండుపల్లె కేంద్రంగా రూపొందే అవకాశం ఉందని సమాచారం. దీంతో పలు రాజకీయ కుటుంబాలు, కొత్త నాయకులు రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.