TPT: శ్రీకాళహస్తిలో నారీశక్తి వందన్ బిల్లుకు మద్దతుగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళా సాధికారతకు నిదర్శనమని వారు కొనియాడారు. మహిళలకు నిర్ణయాధికారం, సమాన గౌరవం కల్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.