KRNL: ఆలూరు నియోజకవర్గంలో డా.BR అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. MLA విరుపాక్షి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను విస్మరించి పాలన సాగిస్తోందని, మహిళల భద్రత తగ్గిందని విమర్శించారు.