W.G: ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తల్లి, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ సతీమణి వంక నాగమణి (95) ఆదివారం మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తణుకులోని నివాసంలో మృతి చెందారు. సీపీఐ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర సమాఖ్య నేతగా నాగమణి కొనసాగుతున్నారు. ఈమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.