ASR: మెగా డీఎస్సీ ద్వారా నియమితులైన కొందరు ఉపాధ్యాయులకు వార్డెన్ బాధ్యతలు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అంగీకరించలేమని పలువురు టీచర్లు తెలిపారు. శుక్రవారం టీడీపీ పాడేరు ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిర్వహించిన ప్రజా దర్బార్లో వినతి పత్రం సమర్పించారు. తాము టీచర్ పోస్టులకే ఎంపికయ్యామని, వార్డెన్గా బాధ్యతలు తీసుకోలేమని పేర్కొన్నారు.