E.G: రాజమండ్రి SKVT కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ పోటీల్లో మాధవరాయుడుపాలెం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. పద్య పఠనంలో 5వ తరగతి విద్యార్థిని తాండ్ర రేణుశ్రీ ప్రథమ స్థానం, తెలుగు వక్తృత్వంలో 9వ తరగతి విద్యార్థిని కె.జాహ్నవి ద్వితీయ స్థానం సాధించారు. బుధవారం విజేతలకు DEO కె.వాసుదేవరావు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు.