ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం ఉషోదయ హై స్కూల్లో ఉంగుటూరు మండల మానవత సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి అధ్యక్షులు KVV.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వృద్ధుల, అనాధ బాలల ఆశ్రమకు మానవత సంస్థ రూ.50 వేల విలువైన 70 కుర్చీలను ఆనంద నిలయం ఛైర్మన్ గుణ్ణం బులెబ్బాయ్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ ఛైర్మన్ పుప్పాల గోపి, సర్వేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.