SKLM: జిల్లాలోని మాజీ సైనికుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ‘నల్సా వీర్ పరి వార్ సహాయత యోజన-2025’ పథకం పనిచేస్తుందని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక సైనిక్ బోర్డును సందర్శించారు. మాజీ సైనికులు తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.