ఏలూరు: నగరంలోని సీఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో బీ-ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న చిలుకూరి సువర్షినీ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గమనించిన హాస్టల్ వార్డెన్, ఆమెను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగని వైద్యం కోసం విజయవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.