AKP: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న పిలుపునిచ్చారు. మంగళవారం అనకాపల్లిలో ఓ హోటల్ లో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుబ్బన్న మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.