AKP: పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామ సర్పంచ్ సఖిలేటి రాము(62) అనారోగ్యంతో కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. జనవరి నెలలో గుండెకు స్టంట్ వేసిన నేపథ్యంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.