PLD: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆదివారం కారంపూడిలో రూ.49 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే జూలకంటితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.