NRPT: జాతీయ రహదారిపై పాల్మాకుల వద్ద ఉదయం జరిగిన బైకు యాక్సిడెంట్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అటుగా మక్తల్ పర్యటనకు వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్ని ఆపి రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను తన సిబ్బందితో కలిసి తాను స్వయంగా పక్కకు తీశారు. సహాయక చర్యలు చేపట్టిన మంత్రి పై ప్రయాణికులు ప్రశంసల జల్లు కురిపించారు.