SKLM: డయేరియాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఫాస్ట్ ఫుడ్, మాంసం దుకాణాల తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా పరిస్థితిని వేగంగా అదుపులోకి తేవచ్చని తెలిపారు.