VSP: నక్కపల్లి మండలం గొడిచెర్ల పీహెచ్సీలో ఓపీ పెంచి సకాలంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించి పలు వార్డులను పరిశీలించారు. భవనంలో కొన్ని చోట్ల బీటలు ఉన్నట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆమె సూచించారు.