VZM: కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు కోరారు. జామి మండలం విజినగిరిలో శుక్రవారం అపరాలు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా మినుములు క్వింటాకు రూ.7,800, పెసలు 8,768 చెల్లించడం జరుగుతుందన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.