SKLM: కోటబొమ్మాళి మండలం మంచాలపేట గ్రామానికి చెందిన మంచాల వెంకటరమణపై భార్య మంచాల సునీత, తన సోదరుడితో కలిసి బుధవారం దాడి చేసింది. తనను ఒక గదిలో బంధించి భార్య బావమరిది గొల్లంగి జగదీష్లు గాయపరిచారని బాధితుడు వెంకటరమణ తెలిపారు. గాయపడిన తనను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.