W.G: ఆకివీడు పెదపేటలో ఇటీవల జరిగిన ఘర్షణలకు సంబంధించి 21 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. మొత్తం 57 మందిపై కేసులు నమోదు చేయగా, పట్టుబడిన వారిని శనివారం భీమవరం కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు.